Skip to main content

Featured Konvict

Pure Love Of Vrindaavan

  PURE LOVE శ్రీ కృష్ణుడు వ్రిందావన్ వదిలి అంటే తన మిత్రులను యశోదా మయ్యా నంద్ బాబా అందరినీ వదిలి  మథురా నగరం లో ఉంటున్న రోజుల్లో  ఒకరోజు శ్రీ కృష్ణుని కి తను పెరిగిన ఊరు అంటే వ్రిందావన్ చాలా గుర్తుకు వస్తుంది, గుర్తుకు రావడం అంటే ప్రతీ రోజు గుర్తుకు వస్తుంది కానీ ఆరోజు ఇంకా ఎక్కువగా గుర్తుకు వస్తుంది ఎంతలా అంటే ఏడ్చే అంతగా.  అయితే మథురా లో కృష్ణుడి తో పాటుగా తన ప్రియాతి ప్రియ మిత్రుడు కూడా ఉంటాడు తన పేరు ఉధవ్, రంగు లొనూ రూపం లోను జ్ఞానం లోను శ్రీ కృష్ణుడితో సరిపోలు  వాడు, బృహస్పతి యొక్క శిషుడు, జ్ఞానానికి తప్ప మరేదానికి అంతగా  ప్రాధాన్యత  ఇచ్చేవాడు కాదు , అయితే శ్రీ కృష్ణుడు తన మిత్రుడైన ఉధవ్ కి ప్రేమ యొక్క మహత్వాన్ని తెలియజేయాలి అని అనుకుంటాడు కానీ ఎప్పుడూ అవకాశం రాలేదు. ఒకరోజు కృష్ణుడు తన రాజ విధులను అన్నింటినీ ముగించుకుని వచ్చి తన గదిలో కూర్చుంటాడు, శ్రీ కృష్ణుడి గదిలో ఒక పెద్ద కిటికీ ఉంటుంది, అందులోనుండి చుస్తే వ్రిందావన్ లోని యమునా నదీ తిరం కనిపించేది, ఆ రోజు శ్రీ కృష్ణుడికి  వ్రిందావన్ చాలా గుర్తుకు వస్తుంది ఎంతైనా చిన్ననాటి నుండి అక్కడే పెరిగాడు కదా, ఎవ్వరికైనా చిన్ననాటి అనుభవాల

Pure Love Of Vrindaavan

 


PURE LOVE


శ్రీ కృష్ణుడు వ్రిందావన్ వదిలి అంటే తన మిత్రులను యశోదా మయ్యా నంద్ బాబా అందరినీ వదిలి  మథురా నగరం లో ఉంటున్న రోజుల్లో 


ఒకరోజు శ్రీ కృష్ణుని కి తను పెరిగిన ఊరు అంటే వ్రిందావన్ చాలా గుర్తుకు వస్తుంది, గుర్తుకు రావడం అంటే ప్రతీ రోజు గుర్తుకు వస్తుంది కానీ ఆరోజు ఇంకా ఎక్కువగా గుర్తుకు వస్తుంది ఎంతలా అంటే ఏడ్చే అంతగా. 


అయితే మథురా లో కృష్ణుడి తో పాటుగా తన ప్రియాతి ప్రియ మిత్రుడు కూడా ఉంటాడు తన పేరు ఉధవ్, రంగు లొనూ రూపం లోను జ్ఞానం లోను శ్రీ కృష్ణుడితో సరిపోలు  వాడు, బృహస్పతి యొక్క శిషుడు, జ్ఞానానికి తప్ప మరేదానికి అంతగా  ప్రాధాన్యత  ఇచ్చేవాడు కాదు , అయితే శ్రీ కృష్ణుడు తన మిత్రుడైన ఉధవ్ కి ప్రేమ యొక్క మహత్వాన్ని తెలియజేయాలి అని అనుకుంటాడు కానీ ఎప్పుడూ అవకాశం రాలేదు.


ఒకరోజు కృష్ణుడు తన రాజ విధులను అన్నింటినీ ముగించుకుని వచ్చి తన గదిలో కూర్చుంటాడు, శ్రీ కృష్ణుడి గదిలో ఒక పెద్ద కిటికీ ఉంటుంది, అందులోనుండి చుస్తే వ్రిందావన్ లోని యమునా నదీ తిరం కనిపించేది, ఆ రోజు శ్రీ కృష్ణుడికి  వ్రిందావన్ చాలా గుర్తుకు వస్తుంది ఎంతైనా చిన్ననాటి నుండి అక్కడే పెరిగాడు కదా, ఎవ్వరికైనా చిన్ననాటి అనుభవాలు ఎంతో మధురమైనవే కదా!


మనకూ అప్పుడప్పుడు మన చిన్ననాటి స్నేహితులు మరియు వారితో కలిసి చేసిన అల్లరి పనులు అప్పుడప్పుడు గుర్తుకు వస్తుంటాయి, కొన్నిసార్లు ఎలా అంటే ఇప్పుడు వెళ్లి వాళ్ళందరినీ కలిస్తే బాగుండు అన్నంతగా. అలాగే ఆరోజు శ్రీ కృష్ణుడికి కూడా అలాగే వెల్లి ఇప్పటికిప్పుడు కలవాలి అన్నట్టుగా గుర్తుకు వస్తుంది.


అలాగే శ్రీ కృష్ణుడు ఆ కిటికీలోనుండి యమునా నది ఒడ్డుని చూస్తూ, ఎవరైనా నా వ్రిందావన్ వాసులు కనిపిస్తే బాగుండు, ఎవరైనా నీల్ల కోసం వస్తే బాగుండు, ఎవరైనా ఆవులను తీసుకొని ఇంటికేల్లె వారు, ఇన్ని సంవత్సరాలు అయ్యాయి నేను వచ్చి! ఏ కారణం అయిననూ ఎవ్వరైనా ఒకరు కంటపడితే బాగుండు అని అనుకుంటూ కనురెప్ప కుడా వేయకుండా అలాగే చూస్తూ కూర్చుంటాడు, అప్పుడు కొంతమంది ఆవులతో కలిసి ఇంటికి వెళుతూ శ్రీ కృష్ణుని కంట పడతారు.

వారిని చూసి కృష్ణుడికి తను స్నేహితులు (శ్రిదామ, ముద్ మంగల్ ) అందరం  కలిసి అలాగే ఆవులను తోలుకుని ఇంటికి వెల్లేది, ఆ సన్నివేశం శ్రీ కృష్ణుడిని ఎంతలా కలవరపరిచిందంటే ఒక్క క్షణం శ్రీ కృష్ణుడు తాను ఎక్కడ ఉన్నాడు అన్న సంగతే మరచి ఆ గోవులను తోలుకుని వేల్లెవాల్లని చూస్తూ గట్టిగా ఇలా అంటున్నాడు “అరే శ్రిధామ ఆగు నెనూ వస్తున్నాను అరే ముద్ మంగల్ త్వరగా పదా ఈరోజు చాలా ఆలస్యం అయింది యశోదా మయ్య అరుస్తుంది” కానీ ఒక్కసారిగా తేరుకున్న శ్రీ కృష్ణుడు తను ఎక్కడ ఉన్నాడో గ్రహించి చిన్న పిల్లవాడి లాగా ఎక్కి ఎక్కి ఏడుస్తున్నాడు ఎంతో గట్టిగా ఏడుస్తున్నాడు. అది విని పక్క గదిలో ఉన్న తన ప్రియాతి ప్రియ మిత్రుడు ఉధవ్ పరిగెత్తుకుని శ్రీ కృష్ణుడి దగ్గరకు వస్తాడు, దీన స్థితిలో ఉన్న కృష్ణ పరమాత్మని తన గుండెలకు దగ్గరగా హద్డుకుంటాడు! ఆశ్చర్యం తో ప్రభూ మీరు ఏడుస్తున్నారా? మీరు ఈ సుకాలు ధూఖాలు అన్నింటికీ అతీతమైన వారు మీరెందుకు ఇలా ఏడుస్తున్నారు అని ప్రశ్నిస్తాడు? అప్పుడు శ్రీ కృష్ణ పరమాత్మ ఇలా అంటాడు.


నాకు వ్రిందావన్ చాలా గుర్తొస్తోంది, నాకు మా యశోదా మయ్యా, నంద్ బాబా  బాగా గుర్తుకు వస్తున్నారు అని ఏడుస్తూ ఉధవ్ తో ఇలా అంటాడు శ్రీ కృష్ణుడు!


అరే నేను వాళ్ళతో ఉన్నన్ని రోజులు ఒక్కసారి కూడా వాళ్ళని ప్రశాంతంగా  ఉండనివ్వలేదు యశోదా మయ్య లాంటి తల్లి యుగ యుగాలు గడిచినా ఎవ్వరికి దొరకదు. నేను అక్కడ ఉన్నన్నాల్లు ప్రతిరోజు ఎదో ఒక గొడవతో ఇంటి ముందుకు వచ్చి మీ కృష్ణుడు ఇది చేసాడు మీ కృష్ణుడు అది చేసాడు అని ప్రతిరోజు ఎదో ఒక ఆరోపణలు ఇంటికి. అయినా కానీ యశోదా మయ్యా ప్రేమ నాపైన ఏమాత్రం తగ్గలేదు అంతకంతా పెరుగుతూనే వచ్చింది.


ఒకసారి నేను గోవులను తోలుకుని వెల్లి ఇంటికి తిరిగి రావడం కాస్త ఆలస్యం అయింది అంతే యశోదా మయ్యా నన్ను చూడగానే గట్టిగా హద్డుకుని ఎడవసాగేది మరియు ఇలా అనేది! కన్నయ్యా ఇంకెప్పుడూ ఇలా ఆలస్యం చేయ్యబోకు, నువ్వు లేకపోతే నా మనసు నిలవదు కన్నా ఎంతో భాదగా ఉంటుంది నువ్వు త్వరగా ఇంటికి తిరిగి రా కన్నా అని ఏడ్చేది.


ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు అయ్యాయి నేను వ్రిందావన్ ని మరియు మా యశోదా మయ్యా ని వదిలి వచ్చి అక్కడ ఎలా ఉంటుందో నా తల్లి యశోదా మయ్యా, శ్రీ కృష్ణుడు అంటాడు నంద్ బాబా లాంటి తండ్రి ఎవ్వరికి ఉండదు, మా నాన్న కావాలని చెప్పులు వేసుకునేవాడు కాదు అలాగే వెళ్లి ఇంటి బయట నిలబడి చూసేవాడు, ఎందుకంటే నంద్ బాబా కి తెలుసు ఇప్పుడు తన చిన్ని కృష్ణుడు తన చెప్పులను తలపై పెట్టుకు  తీసుకుని వచ్చి అంటాడు బాబా మీరు చెప్పులు వేసుకోలేదు త్వరగా వేసుకోండి అమ్మ చుస్తే మల్లి మీపై అరుస్తుంది అని, అప్పుడు నా చేతులతో మా నాన్న కి చెప్పులు తోడిగే వాడిని అని ఉధవ్ తో ఇలా అంటాడు!


ఉధవ్ నేను ఎంతో నమ్మకంగా చెప్తున్నాను నేను ఎప్పుడైతే ఇక్కడకి వచ్చానో అప్పటినుండి మా నాన్న ఇప్పటి వరకు చెప్పులు వేసుకుని ఉండడు. అరే అంతకన్నా ఎక్కువ నేను నా అమాయకులైన గోపికలను భాద పెట్టానే! ఒకసారి యశోదా మయ్యా శ్రీ కృష్ణునితో ఇలా అంటుంది, కన్నయ్యా నువ్వు వాల్ల దగ్గర దొంగతనం ఎందుకు చేస్తావు? వాళ్ళు చాలా పేదవాళ్ళు, వాల్లు ఏదైతే పాలు పెరుగు అమ్ముతారో వాటి ద్వారా వచ్చే ధనం తోనే వాల్లు భోజనం చేస్తారు. మరి నువ్వు వాల్ల కుండలు పగలగొడతావు, వెన్న దొంగలిస్తావు వాల్లు ఏం తింటారు కన్నయ్యా? అని అంటే నేను చాలా రోజుల వరకు దొంగిలించడానికి వెల్లనే లేదు, కొన్ని రోజుల తరువాత వారంతా కలిసి మా ఇంటికి వచ్చారు. వచ్చి అన్నారు, కన్నయ్య కేవలం నీ బాలుడేనా మాకు ఏమీ కాడా, దొంగతనం చేస్తాడా చెయ్యనివ్వు, కుండలు పగలగొడతాడా పగల గోట్టనివ్వు, మేము నిజంగా పేదవాళ్ళం ఎప్పుడు అవుతామంటే కన్నయ్య ఎప్పుడైతే మా ఇంటికి రావడం మానేస్తాడో అప్పుడు మేమంతా నిజంగా పేదవాళ్ళం మీరెప్పుడు అలా అనకండి యశోదా మయ్యా మేము పేదవాళ్ళం అని ఎప్పటి వరకైతే కన్నయ్య మాతో ఉంటాడో అప్పటి వరకూ మా అంత ధనవంతులు ఐశ్వర్యవంతులు ఇంకెవరూ కాదూ. అరే అంతకన్నా ఎక్కువ ధుఖం నేను నా రాధ కి ఇచ్చాను ఎంతగా ప్రేమించాను అంతకు మించి బాధపెట్టాను అని శ్రీ కృష్ణుడు చాలా సమయం వరకు అలాగే రాదే రాదే రాదే అంటూ ఏడుస్తూనే ఉన్నాడు. వింటుంటేనే కళ్ళలో నీల్లు వస్తున్నాయే కనీ ఉధవ్ జి మాత్రం ఏమాత్రం చలించలేదు. ఉధవ్ అన్నీ విన్న తరువాత ఇలా అంటున్నాడు శ్రీ కృష్ణుడితో ప్రభూ !


ఇంతేనా అలా అయితే మీరెందుకు అ జ్ఞానం లేని వ్రిందావన్ వాసులకు జ్ఞాన బోధ చేయకూడదు అని అంటాడు, అప్పుడు శ్రీ కృష్ణుడు ఉధవ్ తో ఇలా అంటాడు నీకెలా తెలుసు వాల్లు అజ్ఞానులు అని అంటే ఉధవ్ అంటాడు ప్రభూ వాళ్ళంతా పాలు పెరుగు అమ్ముకునే వాల్లు వాల్లెప్పుడు గురుకులం వెళ్లి ఉంటారు అంటే శ్రీ కృష్ణుడు బదులుగా ఇలా అంటాడు. అలా అయితే నేను కూడా గురుకులం కి ఒక సంవత్సరం మాత్రమే వెళ్ళాను ఒక సంవత్సరం లో నేనెంత జ్ఞానం పొంది ఉంటాను మరీ అనగా ఉధవ్ అరే ప్రభూ మేరే కదా జ్ఞానం అంటే శ్రీ కృష్ణుడు సరే నేను వాళ్ళకి అర్థం అయ్యేలా చెప్పలేకపోయాను అది నావల్ల కాలేదు మరీ నువ్వు వెళ్లి అర్థమయ్యేలా చెప్పి చూడు అంటాడు, నువ్వే వ్రిందావన్ వెళ్లి యశోదా మయ్యా ని నంద్ బాబా ని మరియు అలాగే గోపికలని కలిసి చెప్పు ఈ ఏడవటం ప్రేమ ఇదంతా వదిలి పెట్టి జ్ఞాన మార్గం లో జీవించండి అనీ. 


ఉధవ్ జి వెంటనే సరే నేను వెళ్లి వాళ్ళందరికీ అర్థమయ్యేలా చెప్పి వస్తాను అని అంటాడు అప్పుడు శ్రీ కృష్ణుడు సరే వెళ్ళు కాని నీ యొక్క దుస్తులు మార్చుకొని వెళ్ళు అని తన పీతంబర్, ముకుట్ మరియు కృష్ణుడి యొక్క ఆభరణాలు అన్ని ఇచ్చి వెళ్ళమంటాడు అప్పుడు ఉధవ్ జి అంటాడు వీటి అన్నింటి అవసరం ఏముంది ప్రభూ అని అప్పుడు శ్రీ కృష్ణుడు నువ్వు ఇలా కాకుండా మామూలుగా వెళితే మాట్లాడటం అటుంచి కనీసం నిన్ను ఎవ్వరూ కన్నేత్తి  కుడా చూడరు అంటాడు. కనీసం ఈ నా వస్త్రాల సుగంధం వల్ల లేదా ఇలా నా లాంటి వస్త్రాలంకరణ వల్ల వాల్లు కనీసం నేను వచ్చాను ఏమో అని తలెత్తి నిన్ను చూస్తారు అని అంటాడు 


అలాగే ఉధవ్ జి వ్రిందావన్ వెల్తాడు అలా చూస్తాడు అక్కడ కొందరు గోపికలు వెళుతుంటారు వాల్లని ఆపి అడుగుతాడు ఇక్కడ నంద్ బాబా ఇల్లు ఎక్కడ అని, అందులో ఒక గోపిక అంటుంది మథుర నుండి వచ్చావా అని అప్పుడు ఉధవ్ మీకెలా తెలుసు అని అంటాడు? కేవలం వేరే ఊరి వాళ్ళే అడుగుతారు లేదంటే వ్రిందావన్ లో కృష్ణుని ఇల్లు తెలియని వాల్లు ఎవరైనా ఉంటారా? 

అప్పుడు ఆ గోపికలు అంటారు ఇదిగో ఈ నీటి దార ఉంది కదా దీనిని అనుసరిస్తూ వెళ్ళండి ఇది ఎక్కడ ఆగితే అదే నంద్ బాబా ఇల్లు అని, గోపికలు అంటారు ఇది సాదారణమైన నీటి దార అనుకోకండి, మీరు ఎప్పుడైతే మా కృష్ణ ని తీసుకొని  వెళ్ళారో అప్పటి నుండి యశోదా మయ్యా నంద్ బాబా ఏడుస్తూనే ఉన్నారుగా హా ఈ దార వల్ల  కన్నీటి దారే, అయినా అన్నీ తీసుకుని వెళ్లారు గా ఇంకా ఏముంది వ్రిందావన్ లో అని మల్లీ వచ్చారు అని అంటూ గోపికలు వెళ్ళిపోతారు, ఉధవ్ జి ఏమి మాట్లాడకుండా అలాగే నంద్ బాబా ఇంటి వరకు వెళతాడు, వెల్లి ఇలా  పిలుస్తాడు  నంద్ బాబా ఓ నంధరాయ  జి, ఇంటిలోపల నుండి ఎవరు అని చిన్నగా వినిపిస్తుంది అప్పుడు ఉధవ్ జీ, అరే నేను ఉధవ్. కృష్ణుని మిత్రుడను సందేశం తో వచ్చాను అని బదులిస్తాడు, అప్పుడు ఇంటినుండి ఒక వ్యక్తి బయటకు వస్తాడు సన్నగా పొట్ట వెన్నుకంటుకు పోయి, కన్నులు లోపలకు వెల్లి ఎంతో నీరసంగా ఉన్న వ్యక్తి బయటకు వచ్చి చెప్పండి నేనే నంధరాయ అని అనగా ఉధవ్ ఆశ్చర్యం తో చూస్తాడు శ్రీ కృష్ణుడు అన్ని గుర్తులు చెప్పి పంపిస్తాడు ఎవరు ఎలా ఉంటారు అని కాని శ్రీ కృష్ణుడు చెప్పిన దానికి ఇక్కడ ఉధవ్ జీ చూసే దానికి ఏమాత్రం సంబంధం లేకుండా ఉంది, ఎంతైనా కృష్ణుడిని పెంచి పోషించిన వారు తండ్రి అని పాదాలు పట్టుకుని క్షమించండి బాబా నేను మిమ్మల్ని గుర్తించలేక పోయాను అని, అలాగే తీసుకెళ్ళి ఇంట్లో కుర్చోబెడతాడు, నువ్వు ఇక్కడే కూర్చో నేను వెల్లి భోజనం తీసుకు వస్తాను అంటాడు “తీసుకు వస్తాను అంటాడు కానీ ఇంట్లో లేదు “ నంద్ బాబా అలా ఇంట్లో నుండి బయటకు వెళుతున్నాడు అంతలో ఉధవ్ జి వంటగది వైపు చూస్తాడు, వంటగది నిండా చెత్త బూజు పట్టిపోయి ఉంటాయి. మీరు నమ్మండి ఎప్పుడైతే కృష్ణుడు ఆ ఇంటినుండి వెళ్ళిపోయాడో అప్పటి నుండి ఆ ఇంట్లో పొయ్యి వెలగలేదు వంట వండనే లేదు. ఇంతలో నంద్ బాబా భోజనం తీసుకొని వస్తాడు ఉధవ్ జి అలాగే ఆలోచిస్తూ భోజనం చేస్తాడు, నంద్ బాబా భోజనం అయిపోయింది కాసేపు విశ్రాంతి తీసుకో అంటాడు అరే నాతో మాట్లాడరా మీరు, నేను అతిధి గా రాలేదు ఇంటికి, ఒక సందేశం తీసుకుని వచ్చాను అని చెప్పగా విని నంద్ బాబా అలా కూర్చుంటాడు, ఇంతలో యశోదా మయ్యా వస్తుంది ఒక్కసారి తన చూపు ఉధవ్ జీ పై పడగానే అరే కృష్ణా నువ్వు వచ్చెసావా కన్నయ్యా అంటూ పరుగెత్తుకుని వస్తుండగా నంద్ బాబా తను కృష్ణుడు కాదు తన మిత్రుడు ఉధవ్.  కృష్ణుడి దగ్గరనుండి సందేశం తో వచ్చాడు అని చెప్పగా విని యశోదా మయ్యా ఇలా అంటుంది సందేశం పంపించాడా? కన్నయ్య చిన్న వయసులో ఏడుస్తూ ఉంటే నేను ఎంత ముక్యమైన పని అయినా వదిలేసి నా కన్నయ్యని ఒళ్లోకి తీసుకుని ఆడించే దానినీ ఎందుకంటే నా కన్నయ్య బాధ పడటం నేను చూడలేను ఏడవటం నేను తట్టుకోలేను,  ఈరోజు వాళ్ళ అమ్మ ఇన్ని రోజులుగా ఏడుస్తుంటే నా కన్నయ్య కనీసం ఒక్కసారైనా రాలేడా? మిత్రున్ని పంపించాడు……………………….

ఉధవ్ జీ అంటాడు కృష్ణున్ని మరీ అంత తప్పుగా అర్థం చేసుకోకండి, తను మిమ్మల్ని ఎప్పుడూ గుర్తు చేసుకుంటాడు, నేను ఇక్కడికి వచేటప్పుడు దేవకీ మాత నాతో ఉధవ్ బేటా యశోదా మాతకి నా మాటగా చెప్పూ నీ లాలనా పాలనా కి ధన్యుడు కృష్ణుడు. ఒకరోజు దెవకీ మాతా కృష్ణుని యొక్క ఇష్టాఇష్టాలు తెలుసుకోవడం కొరకు ఒక వ్యక్తిని యశోద మయ్యా దగ్గరకు పంపిస్తుంది. దెవకీ మాతా అంటుంది మీరు అన్నారు కృష్ణుడు చాలా చంచల గుణము కలిగిన వాడు అని, రోజంతా ఉరుకులు పరుగులతో ఆటపాటలతో అల్లరల్లరి చేస్తూ ఉంటాడు అని, కానీ ఇక్కడ ఇంటిలో నుండి కాలు కూడా బయట పెట్టటం లేదు అని, అరే అల్లరి అనే మాట అటుంచితే నేను ఇప్పటి వరకు కృష్ణుడు నవ్వుతూ ఉండటం చూడలేదు, అసలు కృష్ణుడు ఎలా నవ్వుతాడు? మీరు చెప్పారు కృష్ణుడు భోజన ప్రియుడు అని  మీరు రొజూ కృష్ణునికి ఎనిమిది సార్లు భోజనం తినిపించేవారు అని, ఒకరోజు నేను గో రస్ తో చేసిన తీపి వంటకం చేసి పెట్టాను కృష్ణునికి ప్రతిరోజు చేతులు జోడించి భోజనం ముందు కూర్చునేవాడు ఆరోజు భోజనం వదిలేసి వెళ్ళిపోయాడు, వెల్లి అన్నాడు దేవకీ మాతా తో చెప్పండి నేను తినే భోజనం లో గో రస్ తో చేసిన  తీపి వంటకం పెట్టకండి అనీ ఎందుకంటీ అది తింటే నాకు నా వ్రిందావన్ గుర్తొస్తుంది నాకు మా యశోదా మయ్యా గుర్తుకు వస్తుంది అని. కానీ యశోదా మయ్యా ఇంతకన్నా ఎక్కువ వినలేక పోయింది ముర్చితురాలై పదిపాయింది. నంద్ బాబా వెల్లి యశోదా మయ్యా ని లోపల పడుకొబెట్టి వస్తాడు ఉధవ్ తో ఇలా అంటాడు యశోదా కేవలం ఇంతసేపే విశ్రాంతి తీసుకుంటుంది అది కుడా తను ముర్చితురాలు ఐనప్పుడు మాత్రమే. లేదంటే పిచ్చి దానిలా తిరుగుతూనే ఉంటుంది, ప్రతీ ఇంటికీ వెళుతుంది తలుపు తట్టి అందర్నీ అడుగుతుంది కృష్ణుడు వచ్చాడా? దొంగతనం చేయడానికి అయిన వస్తాడు గా అలా ఏమైనా వచ్చాడా? వృక్షాలను కుడా అడుగుతుంది నా కృష్ణున్ని ఎక్కడైనా చూసారా? ఇక్కడే తురుగుతూ ఉంటాడు కదా అనీ…….గోవర్ధన్ పర్వతం తో అడుగుతుంది నా కన్నయ్య నే కదా నీకు పూజలు చేసింది కృష్ణ కి నువ్వంటే చాలా ఇష్టం నువ్వేమైనా చూసావా? నీకు కనపడితే చెప్పండి కృష్ణ మీ అమ్మ నిన్ను చాలా గుర్తుచేసుకుంటుంది ఒక్కసారి కనిపించమని చెప్పండి నా కన్నయ్య లేకుండా ఉండలేక పోతున్నాను………..అప్పుడే ఉధవ్ కి తను వచ్చిన పని గుర్తుకు వస్తుంది.


ఉధవ్ జి నంద్ బాబా తో ఇల అంటాడు……….

బాబా! మీరు చాలా సుభాగ్యవంతులు ఎందుకంటే మీ ఇంటికి కృష్ణుడు వచ్చాడు మీరే పెంచారు, కానీ మీరు ఎవరినైతే పుత్రుడు పుత్రుడు కన్నయ్యా కన్నయ్యా అంటున్నారో తను ఎవరికీ పుత్రుడు కాడు, తను పరమ పిత భగవాన్ శ్రీ మహా విష్ణువు అవతారం తను ఎవరికీ పుత్రుడు కాడు తను కేవలం భగవంతుడు మాత్రమే మీ ఇంటికి రావడం ఇదంతా కేవలం తన లీల మాత్రమే అని అంటాడు…….అప్పుడు నంద్ బాబా విని నేను నిన్ను జ్ఞానం కలిగిన బాలుడవు అనుకున్నాను కానీ నువ్వు చాలా సాధారణమైన బలుడివి అని ఇప్పుడే తెలిసింది 


ఎమన్నవూ కృష్ణుడు భగవంతుడా? అరే భగవంతుని యొక్క ఒక్క లక్షణం కూడా లేదు తన దగ్గర,

అరే భగవంతుడు అయితే అందరి కడుపు నింపే వాడు కాని కృష్ణుడు ఆకలి ఆకలి అని యశోదా చుట్టూ ఏడుస్తూ తిరిగేవాడు, అన్ని పనులూ వొదిలెయ్ అమ్మా ముందు నాకు భోజనం పెట్టు అని, నువ్వేమో భగవంతుడు అంటున్నావ్! భగవంతుడు ఎప్పుడూ సత్య మార్గం నందే ఉంటాడు కానీ నా కృష్ణుడు నోరు తెరిస్తే అబద్దం, దొంగతనం చేస్తాడు నువ్వేమో భగవంతుడు అంటున్నావ్! 


సరే నేను నమ్ముతున్నాను తను భగవంతుడే అని. కానీ భగవంతుడు అయితే ఎప్పుడూ తప్పు అయితే చెయ్యడు కదా, సరే తప్పు నాదే నేను తనని పుత్రుడు పుత్రుడు అని తిరిగాను కానీ కృష్ణుడు ఎని సార్లు నన్ను బాబా బాబా అని పిలిచాడు యశోదా ని మయ్యా మయ్యా అని పిలిచాడు , యశోదా మయ్యా, నంద్ బాబా మరియు భలరాముడు అందరూ తెలుపు నువ్వొక్కడివే నల్లగా ఉన్నావు నువ్వు వాల్ల పుత్రుడివి కాదు అని గోపికలు ఎదడిపిస్తే పరిగెత్తుకు వచ్చి యశోదా తో అరిచేవాడు మయ్యా నువ్వు వెళ్లి చెప్పు నేను నీ కొడుకునే అని……..నువ్వేమో భగవంతుడు అంటున్నావు.

సరే నేను నమ్ముతాను తను భగవంతుడే అని అలా అయితే నా బాధను పోగోడతాడా? అంటే హా మీరు ఈ ఏడవటం ప్రేమ ఇవన్ని వదిలి పెట్టి జ్ఞాన మార్గం లో వెళ్ళండి అంటే నంద్ బాబా ఇలా అంటాడు, ప్రపంచం మొత్తం లో ఎవ్వరు ఉన్నా లేకున్నా ఒక్కరు మాత్రం ఎప్పుడూ  తోడులేని వాల్లకి తోడుగా ఉండేవాడు ఎవరు భగవంతుడు, నేను ఇప్పటివరకూ కేవలం నా పుత్రుడు నన్ను వదిలి పెట్టి పోయాడు అనుకున్నాను అయినా నేను ఆ భగవంతుని తలచుకుంటూ తన నమ్మకం తోనే జీవిస్తున్నాను, కానీ నువ్వు ఇప్పుడు అంటున్నావు ఆ భగవంతుడే నన్ను విడిచి వెళ్ళిపోయాడు అని నేను ఎవరి ధైర్యం తో అయితే జీవిస్తున్ననో ఆ భగవంతుడే నన్ను వదిలి వెళ్ళిపోయాడు, ఇప్పుడు ఇంకా ఎవరికోసం బ్రతకాలి నేను ఎందుకు బ్రతకాలి, నేను బ్రతకడానికి ఉన్న ఒకే ఒక ఆశ ఆ భగవంతుడు కాని ఇప్పుడు ఆ భగవంతుడే మమ్మల్ని వదిలి వెళ్ళిపోయాడు బ్రతకడానికి ఉన్న ఒక్క ఆశ కూడా లేకుండా పోయింది. నేను ఎంత పాపం చేస్తే ఆ భగవంతుడే నన్ను వదిలి వెళ్తాడు.


ఉధవ్ జీ కి ఎం మాట్లాడాలో అర్థం కావటం లేదు, ఒక్క మాట కూడా బదులు ఇవ్వకుండా ఉధవ్ జీ అక్కడనుండి వెళ్ళిపోతాడు.


అలాగే నడుస్తుంటాడు మధ్యలో ఒక చోట గోపికలు కలుస్తారు, వాల్లు ఉధవ్ జి ని కూర్చోబెట్టి అంటారు కృష్ణ పంపించాడా? ఉధవ్ జి మీకెలా తెలుసు ? ఎందుకంటే ఈ దుస్తులు తనే వేసి ఉండాలే ఈ ముకుట్ ఆ కుండల్ ఈ ఆభరణాలు అన్ని తనవేనా? ఉధవ్ జీ హా అని బదులిస్తాడు అప్పుడు గోపికలు ఇలా అంటారు 


తన ఐశ్వర్యం చూపిస్తున్నాడా మాకు రాజు అయ్యాడని అని కోపంగా అంటారు ఎందుకంటీ వాల్లని వదిలి వెళ్ళిపోయాడు అని అప్పుడు ఉధవ్ జీ అంటాడు………….అరే ఇంత కోపం దేనికి కృష్ణుడు మీకు ఒక సందేశం ఇవ్వమని పంపించాడు అని అంటాడు అప్పుడు వాల్లు ఏమిటి ఆ సందేశం?


ఈ ఏడుపులు అవి వదిలేసి జ్ఞాన మార్గం లో వెళ్ళండి ఈ ప్రేమ అభిమానం అంతా వదిలేయండి అని అంటాడు  అప్పుడు గోపికలు అంటారు జ్ఞాన మార్గం లో ఉంటే ఏమిటి ప్రయోజనం అని అంటారు అప్పుడు ఉధవ్ జీ అంటాడు అరే అందరికి స్వర్గం ప్రాప్తిస్తుంది అని అంటాడు, అలాంటి స్వర్గాన్ని మేము ఎప్పటికి స్వీకరించము జ్ఞాన మార్గం అంటే కృష్ణునికి దూరం గా ఉండటం అంటే అలాంటి  స్వర్గం మాకు అవసరమే లేదు ఒకవేళ కృష్ణ ప్రేమలో ఉండటం వల్ల మాకు నరకం ప్రాప్తి చెందుతుంది అంటే మేము జన్మ జన్మ లకూ నరకం లో ఉండటానికి సిద్దమే కాని తన ప్రేమను మాత్రం వదులుకోలేము అని బదులిస్తారు 



ఉధవ్ జీ కి ఎం మాట్లాడాలో అర్థం కాలేదు అక్కడ నుండి మవునంగా  గా బయలుదేరి నేరుగా మథురా నగరానికి వచ్చి క్రిషుడి దగ్గరకు వెల్తాడు అప్పుడు శ్రీ కృష్ణుడు ఇలా అంటాడు అరే  ఉధవ్ చాలా ఆలస్యం చేసావు నేను నిన్ను వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పడానికి పంపించాను ఇంత ఆలస్యం చేసావు ఎందుకు అని ప్రశ్నిస్తాడు? 


ఉధవ్ జీ కృష్ణుడితో ఇలా అంటాడు హే కృపాలు, హే దయామయా, హే కరుణానిధి. చెప్పలేనన్ని పేర్లు ఉన్నాయి నీకు అన్నీ నువ్వే పెట్టుకున్నావు  అని దురుసుగా మాట్లాడతాడు, అప్పుడు శ్రీ కృష్ణుడు ఇలా అంటాడు నిన్ను వ్రిందావన్ కి పంపించడం సఫలమైంది ఎందుకంటే ఇలా కేవలం గోపికలు మాత్రమే నాతో మాట్లాడేవారు వారు తప్ప మరెవ్వరికి నాతో ఇంత దురుసుగా మాట్లాడే ధైర్యం లేదు . అప్పుడు ఉధవ్ జీ కృష్ణుడి తో ఇలా అంటాడు.


హే కృష్ణా ఎం చేస్తున్నావు నువ్వు ఈ స్వార్థ పూరితమైన జనం మధ్య, మీరెందుకు మల్లీ తిరిగి వ్రిందావన్ కి వెళ్ళటం లేదు అని ప్రశ్నిస్తాడు అప్పుడు కృష్ణుడు నేను వెళ్ళలేను ఎందుకంటే కంసుని యొక్క మామ జరాసంధుడు తన అల్లుడి ప్రాణాలు తీసినందుకు ప్రతీకారం కోసం నాపై దండయాత్ర చేస్తూనే ఉన్నాడు నాపై మాత్రమే కాదు మథుర నగరం పై ఇక్కడ పెద్ద పెద్ద భవనాలు సైనికులు అస్త్రాలు ఉన్నాయి కనుకనే తను ఓడిపోయి  వెలుతున్నాడు కానీ వ్రిందావన్ లో ఇవేవి లేవు జరాసంధుడు కానీ ఒక్కసారి వ్రిందావన్ పైన దండయాత్రకు వస్తే వ్రిందావన్ ఉండదు, అలా అయితే అప్పుడప్పుడు వెళ్లి రావచ్చు  కదా అని  ఉధవ్ జీ అనగా కృష్ణుడు  అలా కుడా వేల్లలేను ఎందుకంటే ఒకవేల జరాసంధునికి నాకు వ్రిందావన్ అంటే ఇష్టం  అని తెలిస్తే నన్ను మానసికంగా బాదించడానికి వాల్లపై దండయాత్ర చేస్తాడు. అప్పుడు ఉధవ్ జీ అలా అయితే మరొక్క మార్గమే ఉంది వ్రిందావన్ ప్రజలందరినీ ఇక్కడకే తీసుకురా ఇక్కడైతే పెద్ద పెద్ద కోటలు సైనికులు ఉన్నారు కదా  అంటాడు, అప్పుడు శ్రీ కృష్ణుడు అది ఇంకా వీలు కానిది ఎందుకంటే ఇక్కడ ఉన్న ప్రతీ ఒక్కరికీ నేను ఎవరు అనేది తెలుసు కానీ వ్రిందావన్ లో నేను కేవలం ఆవులను పాలించే ఒక సాదారనమైన  గొల్ల వాడిని 


అక్కడ కేవలం కొంచం వెన్న కోసం నాతో గోపికలు నృత్యం చేపించేవారు, ఇక్కడ నేను ప్రోధున్నే లేచి వాసుదేవుడి కాళ్ళకు నమస్కారం చేసినప్పుడు నా కన్న తండ్రే ఐనప్పటికీ నాకు ఆశీర్వాదం ఇవ్వడానికి సంకోచిస్తాడు, ఎందుకంటే వసుదేవునికి తెలుసు నేను భగవంతుడు అయిన ఆ విష్ణుమూర్తి అవతారం అని కానీ వ్రిందావన్ లో నేను నంద్ బాబా చెప్పులు నేను నా తలపై పెట్టుకునే వాడిని, దెవకీ మాతా నా కన్న తల్లే ఐనప్పటికీ నన్ను ప్రేమగా హతుకోవటానికి సంకోచిస్తుంది అరే కృష్ణుడు సాక్షాతూ ఆ భగవంతుని అవతారమే కదా అని, కానీ వ్రిందావన్ లో యశోదా మయ్యా నన్ను తాడుతో కాళ్ళు చేతులు కట్టి పదేసేది.  సరే నేనెవరో తెలిసినా పరవాలేదు కాని ఇక్కడ నేను చేసేవి చేయాల్సిన పనులు ఎవైతే ఉన్నాయో  యుద్ధం చేయించాలి రాజనీతి బోధించాలి ఇవన్ని వాల్లు చుస్తే అనుకుంటారు అరే కృష్ణ ఎలా ఉండేవాడు ఆడుతూ పాడుతూ అల్లరి చేస్తూ కానీ ఎలా ఐపోయాడు ఇక్కడకు వచ్చి గొడవలు యుద్ధాలు అందర్నీ చంపేస్తున్నాడు ఇతను మన కృష్ణ కాదు అనీ, కానీ నేనెప్పుడు వాల్లని వదిలి ఉండలేదు ఉధవ్ ఎల్ల వేళలా నేను వారితోనే ఉన్నాను వ్రిందావన్ లో గోపికలు నన్ను గుర్తుకు తెచ్చుకొని మూర్చితులై పడిపోతారో నేను వెళ్లి వాల్లని ఇంటి దగ్గర దిగాబెడతాను, నేనెప్పుడు వ్రిందావన్ వదిలి వేల్లలేను ఇప్పటికీ ఎప్పటికీ .




ఈ రకంగా శ్రీ కృష్ణుడు ఉధవ్ కి ప్రేమ తత్వం యొక్క జ్ఞానం కలిగించాడు.


Comments

Popular posts from this blog

Moral Tale of Jatayuvu జటాయువు నీతి కథ

 ధర్మొ రక్షతి రక్షితః తన చివరి శ్వాసను విడుస్తున్న , జటాయువు నేను రావణుడితో గెలవలేనని నాకు తెలుసు, అయినా కానీ నేను పోరాడాను. నేను పోరాడకపోతే, రాబోయే తరాలవారు నన్ను పిరికి వాడు అని అనుకుంటారు. రావణుడు జటాయువు రెండు రెక్కలను తెంచినప్పుడు. అప్పుడు  మృత్యువు వచ్చింది. అపుడు జటాయువు మృత్యువుకు సవాలు విసిరాడు.  "జాగ్రత్త! ఓ మృత్యువా ! ముందుకు రావడానికి సాహసం చేయద్దు. నేను ఎప్పటివరుకు మరణాన్ని అంగీకరించనో, అప్పటి వరకు నువ్వు నన్ను తాకవద్దు. నేను సీతామాత యొక్క సమాచారం  "ప్రభు శ్రీరాముడి" కి చెప్పనంత వరకు నా వద్దకు రావద్దు అన్నాడు! మరణం జటాయువును తాకలేకపోతోంది, అది నిలబడి   వణుకుతూనే ఉంది. మరణం అప్పటివరకు కదలకుండా నిల్చునే వుంది, వణుకుతూనే ఉంది. తాను  కోరుకోగానే చనిపోయే వరం జటాయువుకి వచ్చింది. కానీ మహాభారతానికి చెందిన భీష్మ పితామహుడు  ఆరు నెలలు బాణాల అంపశయ్య మీద పడుకుని మరణం కోసం ఎదురు చూశాడు. అతని కళ్ళలో కన్నీళ్ళు. ఏడుస్తూవున్నాడు. కానీ భగవంతుడు మనస్సులో తనకి తాను  చిరునవ్వు నవ్వుతున్నారు! ఈ దృశ్యం చాలా అలౌకికమైనది. రామాయణంలో జటాయువు శ్రీరాముడి  ఒడిలో పడుకున్నాడు. ప్రభు "శ్

Genealogy tree of lord Rama శ్రీ రాముని వంశ వృక్షం

  శ్రీ రామ చంద్రుడి వంశ వృక్షము బ్రహ్మ కొడుకు మరీచి మరీచి కొడుకు కాశ్యపుడు కాశ్యపుడి కొడుకు సూర్యుడు సూర్యుడి కొడుకు మనువు మనువు కొడుకు ఇక్ష్వాకువు ఇక్ష్వాకువు కొడుకు కుక్షి కుక్షి కొడుకు వికుక్షి వికుక్షి కొడుకు బాణుడు బాణుడి కొడుకు అనరణ్యుడు అనరణ్యుడి కొడుకు పృధువు పృధువు కొడుకు త్రిశంఖుడు త్రిశంఖుడి కొడుకు  దుంధుమారుడు దుంధుమారుడు కొడుకు మాంధాత మాంధాత కొడుకు సుసంధి సుసంధి కొడుకు ధృవసంధి ధృవసంధి కొడుకు భరతుడు భరతుడి కొడుకు అశితుడు అశితుడి కొడుకు సగరుడు సగరుడి కొడుకు అసమంజసుడు అసమంజసుడి కొడుకు అంశుమంతుడు అంశుమంతుడి కొడుకు దిలీపుడు దిలీపుడి కొడుకు భగీరధుడు భగీరధుడి కొడుకు కకుత్సుడు కకుత్సుడి కొడుకు రఘువు రఘువు కొడుకు ప్రవుర్ధుడు ప్రవుర్ధుడి కొడుకు శంఖనుడు శంఖనుడి కొడుకు సుదర్శనుడు సుదర్శనుడి కొడుకు అగ్నివర్ణుడు అగ్నివర్ణుడి కొడుకు శ్రీఘ్రవేదుడు శ్రీఘ్రవేదుడి కొడుకు మరువు మరువు కొడుకు ప్రశిష్యకుడు ప్రశిష్యకుడి కొడుకు అంబరీశుడు అంబరీశుడి కొడుకు నహుషుడు నహుషుడి కొడుకు యయాతి యయాతి కొడుకు నాభాగుడు నాభాగుడి కొడుకు అజుడు అజుడి కొడుకు ధశరథుడు ధశరథుడి కొడుకు రాముడు రాముడి కొడుకులు లవకుశులు 🙏జై